మహా మృత్యుఞ్జయ మంత్రం ప్రధానంగా మరణభయం, ఆరోగ్యం సమస్యలు, ఆపత్తులు, ప్రమాద పరిస్థితులు ఎదురైనప్పుడు పఠిస్తారు. శివుని కృపతో భక్తులకు ధైర్యం, మానసిక శాంతి, ఆరోగ్యం, దీర్ఘాయువు లభిస్తుంది. ఇది పాపాలను శమనం చేసి, జీవితం భయరహితంగా, సుఖసమృద్ధిగా మరియు రక్షితంగా ఉండటానికి దారి చూపుతుంది.
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం |
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ||
అర్ధం - అందరికి శక్తిని ఇచ్చే, సుగంధభరితుడైన ముక్కంటి దేవుడు శివుని మేము పూజిస్తున్నాము. పండులోని తొడిమ నుండి వేరుపడినట్టు, మేము కూడా మరణం మరియు మర్త్యత్వం నుండి విముక్తి పొందాలి.
మరిన్ని
శ్రీ శివ స్తోత్రాలు పరిశీలించండి.
0 Comments